ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగములో పెను మార్పులు జరిగి ప్రశంశనీయమైన ప్రగతి సాధించినప్పటికి, ఇంకను పలు సమస్యలు పరిష్కరించేదిశలోవున్నవి. వినియోగదారులకి సక్రమమైన సేవలందించి, సంత్రుప్తి కలిగించే వాతావరణాన్ని నెలకొల్పాలని వుద్దేశంతో ప్రతి సబ్-డివిజనులలో వినియోగదారుల సేవా కేంద్రములు నెలకొల్పబడినవి. కొన్ని సమస్యలు పరిష్కరించినప్పటికి, ఇంకా కొంత అసంత్రుప్తి వున్నదని భావించవచ్చు. వినియోగదారులకు సంత్రుప్తి కరమైన సేవలు లేవని ముందుకువచ్చి చెప్పడానికి, క్షేత్ర స్థాయిలో వాస్తవిక ఇబ్బందులు గల్గునని తలచి చెప్పలేక యుండవచ్చును.
అయితే కొన్ని సమయాలలో విద్యుత్ ఉత్పత్తి, వాస్తవిక వాడకానికి సరిపడక పోవచ్చును. ఉత్పత్తి మరియు వాడక వ్యత్యాసాన్ని క్రమబద్దీకరణ అవసరము దృష్టిలో ఉంచుకొని సంవత్సరములో అపుడప్పుడు అప్రకటిత కోతతో వినియోగదారులకు, అసంత్రుప్తికి కారణాలు కావచ్చును.
అయితె వినియోగదారులే, కొంత శ్రద్ధ వహించి తమ, తమ, అధీనములో పనిచేయించుకునేదానికి, నాణ్యమైన మోటార్లు, కెపాసిటర్లు, సి.ఎఫ్.ఎల్ బల్బులు, అవసరమైన మేరకు హీటర్లు, లేక వాటి స్థానములో సోలార్ హీటర్లు, సోలార్ లైట్లు, ఎలక్ట్రానిక్ రేగ్యులేటర్సుతో ఫ్యాన్లు, వీలున్న సూర్యరశ్మితో వెలుతురు, ఆఫీసు వేళలలో పరిమితమైన వాడకం, వీధి లైట్ల, వాడకములలో అదుపు, వ్యవసాయానికి హెచ్.వి.డి.ఎస్ ట్రాన్స్ ఫార్మర్లు,డిమాండ్ సైడ్ మనేజ్ మెంట్ వాడకము, అక్రమ వాడకముదారులపై, సక్రమవాడకముదారులు సంఘటితంగ అదుపు చేసిన, దాదాపు కోటి ఎనభై లక్షల వినియోగదారులు, సంవత్సరానికి వాడుకుంటున్న దాదాపు 53,000 మిలియన్ యూనిట్లు, విద్యుత్తులో 2500 మిలియన్ యూనిట్లు పొదుపు చేయగల వీలుంది. ఒక యూనిట్ పొదుపు 2 యూనిట్లు ఉత్పత్తికి సమానము, అంటే దాదాపు 5000 మిలియన్ యూనిట్లు అన్నమాట. ఇది 800 మెగా వాట్స్ ఉత్పత్తి కేంద్రమునకు సమానము. సుమారు 1 మెగా వాట్టుకి 5 కోట్ల ఖర్చు, అవుతుంది. ఇది మన పొదుపు వలన ఆదా. దీనివలన అప్పుడప్పుడు కలిగే అసౌకర్య, అప్రకటిత కోత నుండి మనము కొంత మేరకు అంతరాయములు తగ్గించు కొనడానికి వీలుంది. అంటే మన సమస్యలకు మనమే పరిష్కారము, కొంత వరకు చేయ వచ్చును.
గ్రామ, పట్టణములలో, సర్వీసు వారిగ, పరిమితికి మించి ట్రాన్స్ ఫార్మరుపై అక్రమలోడు, లైన్ల దగ్గరగ చెట్లు, కొమ్మలు, నాసిరకమైన నిర్మాణ పనులు, కాలము చెల్లిన లైన్లు, లూజ్ లైన్లు, నాణ్యతలేని లైన్లు, ఇవన్నియూ, కొంత వరకు అంతరాయములకు మూలము. మనకొరకు, మనము, అనే సమాజ, సామాజిక చొరవతో ప్రజా పరిశీలక కమిటిలుగా ఏర్పడి, నెలవారిగ సమీక్షలు జరిపి, క్షేత్ర స్థాయి, విద్యుత్ అధికారులకు, తెలిపి, సమస్యలు నివారణ చర్యలు చేపట్టవచ్చును. ఇందువలన మనకై మన వలన జరిగే అసౌకర్యము తొలగించటానికి దారి, సులభమౌతుంది. ప్రయత్నించి, ఫలితము చూడగలరు.
అయితే ఇది అంత సులభతరమైన విషయము కాదు. సమాజ భాధ్యత అనుకుంటే సమస్యలు తీరుతాయి. నాడు నెహ్రూ, గాంధి, పటేల్ లాంటి మహమహులు మాకెందుకొచ్చిందిలే అనుకుంటే, నేడు మనము అనుభవిస్తున్న స్వతంత్ర ప్రజాస్వామ్యము వచ్చేదా! ఒక చిన ఉదాహరణ 2002 సం!!లో షుమారు 1262 కొట్ల రూపాయలు లోటు, 30.2% లైను నష్టాలు ఉన్న ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సంస్థను 2006 సం!!నాటికి షుమారు 291 కోట్ల రూపాయలు, మిగులుదల, మరియూ లైను నష్టాలు 20.2% తగ్గించి, మెరుగైన సేవలందించే దిశకు చేర్చిన, చైర్మన్ శ్రీమతి రేచల్ చెటర్జీ గారు అభినందనీయురాలు. ఇటువంటి మార్గదర్శి చూపిన బాటలో, గ్రామ, కాలని, పట్టణ స్థాయిలో, ప్రజా పరిశీలన సంఘాలుగా ఏర్పడి, సామాజిక సేవా తత్పరతతో, శాంతియుత మార్గములో సమస్యలను, క్షేత్ర స్థాయి ద్రుష్టికి తెచ్చి, వారితో విపులముగా తెలిపి సహకరించి పరిష్కరించుకొన్న యెడల, మనకై మనమే, అంతరాయములను తగ్గించుకొన్నవారమైతాము.